మెగా హీరోతో పెళ్లిపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్.

మెగా హీరోతో పెళ్లిపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్.

టాలీవుడ్ లో  డజనుకు పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రముఖ హీరోయిన్ రెజీనా కాసాండ్రా సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. కాగా నటి రెజీనా 2012 లో విడుదలైన శివ మనసులో శృతి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

 ఆ తర్వాత సాయి తేజ్, రవితేజ, నారా రోహిత్, సందీప్ కిషన్ తదితర హీరోలతో కలసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం నటి రెజీనా ఉత్సవం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తన వ్యక్తిగత జీవితంపై స్పందించింది. 

ఈ క్రమంలో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తో పెళ్లి విషయంపై వినిపిస్తున్న రూమర్లు గురించి మాట్లాడుతూ సాయి తేజ్ తనకి మంచి స్నేహితుడని అంతేతప్ప తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. అంతగాకుండా తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని కొందరు ప్రేమ అనుకుంటూ పెళ్లి పుకార్లు ప్రచారం చేస్తున్నారని అందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. 

ALSO READ | అలా చేసినందుకు ఫ్యాన్స్ కి సారీ చెప్పిన స్టార్ నటి..

ఇక ఉత్సవం చిత్రం విషయానికొస్తే సెప్టెంబర్ 13వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ చిత్రంలో దిలీప్ ప్రకాష్,  రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. లవ్ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని బాగానే అలరిస్తోంది.