
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పై నమోదైన కేసును సోమవారం హైకోర్టు కొట్టివేసింది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.2500 కోట్లను సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి పంపారంటూ గతేడాది మార్చి 27న కేటీఆర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్కు చెందిన బి. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా మార్చి 29న బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. పోలీసు కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణను కొనసాగిస్తే అది న్యాయప్రక్రియను దుర్వినియోగం చేసినట్లవుతుందని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ను కొట్టివేశారు.