లైంగిక వేధింపుల కేసు: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‎కు హైకోర్టులో ఊరట

లైంగిక వేధింపుల కేసు: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‎కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‎కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. లైంగిక ఆరోపణల కేసులో మల్లిక్ తేజ్‎కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, తెలంగాణ సంస్కృతిక సారధి ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ తేజ్‎పై ఓ మహిళా ఫోక్ సింగర్ ఫిర్యాదు చేసింది. మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని జగిత్యాల పీఎస్‎లో కంప్లైంట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల మల్లిక్ తేజ్‎పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జగిత్యాలలో తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై మల్లిక్ తేజ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. 

Also Read :- గాయత్రి మరణ వార్త విని చాలా బాధపడ్డా

ఈ పిటిషన్‎పై ఇవాళ (2024, 5 అక్టోబర్) హైకోర్టులో విచారణ జరగగా.. మల్లిక్ తేజ్ తరపున న్యాయవాది జక్కుల లక్ష్మణ్ వాదనలు వినిపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేశారని, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న మల్లిక్‎పై కావాలనే అక్రమ కేసులు పెట్టారని లక్ష్మణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనల అనంతరం ఈ కేసులో మల్లిక్ తేజ్‎కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ  హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.