గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 పోస్టులు పెంచి ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదు : గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 పై మళ్లీ కేసులు

గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 పోస్టులు పెంచి ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదు : గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 పై మళ్లీ కేసులు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1 పోస్టుల భర్తీ కోసం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చెల్లదంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యాయవాది జె.సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ..2022లో 503 పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశారని, వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దయిందని కోర్టుకు తెలిపారు.

అయితే గతంలో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకే దీన్ని పరిమితం చేయాలన్నారు. 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను కలిపి తాజాగా నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేయడం చెల్లదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదిస్తూ.. టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసే అధికారం ఉందన్నారు. అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఇరు వాదనలు విన్న జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుల్లా కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.