
కరీంనగర్ టౌన్,వెలుగు: పుట్టిన నేల గర్వపడేలా రాణించాలని హైకోర్టు జడ్జి ఈవీ వేణుగోపాల్ సూచించారు. ఆదివారం సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని కరీంనగర్ మంకమ్మతోటలోని తన నివాసంలో సివిల్స్లో ర్యాంకులు సాధించిన నందాల సాయికిరణ్(27వ) , కొలనుపాక సహన(739)ను జడ్జి సన్మానించి రాజ్యంగ పుస్తకాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్ సర్వీసెస్పై అవగాహన కల్పించి, ప్రతీ గల్లీ నుంచి ఓ ఐఏఎస్ ఆఫీసర్ను తయారు చేయాలని పిలుపునిచ్చారు. సివిల్ ర్యాంకర్లను యువత ఆదర్శంగా తీసుకొని ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. జడ్జి కె.వెంకటేశ్, కార్పొరేటర్ మహేశ్, అంజనీప్రసాద్ పాల్గొన్నారు.