
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఆదివారం హైకోర్టు జడ్జి అలిశెట్టి లక్ష్మినారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశారు. ముందుగా హైకోర్టు జడ్జికి మంగళవాద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. హన్మకొండ జిల్లా జడ్జి రమేశ్ బాబు, ఆర్డీఓ శ్రీపాల్రెడ్డి, తహసీల్దార్నారాయణ, ఈఓ శేషు భారతి, వెంకటనాగరాజు శర్మ, ప్రదీప్కుమార్ శర్మ ఉన్నారు.