హైడ్రా కమిషనర్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు

హైడ్రా కమిషనర్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు సంచలనంగా మారింది. ఈరోజు (సెప్టెంబర్ 30) హైడ్రా కమిషనర్ హైకోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు పెండింగ్ కేసులో ఉన్న  బిల్డింగులను హైడ్రా కూల్చడాన్ని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. హైడ్రా ఇటీవల  అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని కూల్చేసింది. ఆ బిల్డింగ్ నిర్మాణంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. దీంతో కోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కూల్చివేతకు గల వివరణ వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైకోర్టు కోరింది. సోమవారం(నేడు)  హైకోర్టు ముందు హాజరు కావాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.