
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవోగా అసదుల్లాను నియమించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 23 ప్రకారం వక్ఫ్ సీఈవో నియామకం జరగలేదని ఆక్షేపించింది. సీఈవో పదవి నుంచి అసదుల్లాను వెంటనే తొలగించాలని, 4 నెలల్లోగా అర్హుడైన అధికారిని ఈసీవోగా నియమించాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్ నగేష్ భీమపాక గురువారం తీర్పు చెప్పారు. తాత్కాలిక సీఈవోగా షేక్ లియాకత్ హుస్సేన్ను కొనసాగించవచ్చన్నారు.