మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు సీరియస్

మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకి లేఖ రాశారు హైకోర్టు జడ్జి. పిటిషన్ ను సుమోటోగా తీసుకున్న సీజే ధర్మాసనం.. కోర్టు ధిక్కరణ పిటిషన్ గా ఎందుకు పరిగణనలోకి తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ ఎంపీ రఘునం దన్ రావుకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు సీజే ధర్మాసనం. 

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన స్టేపై బీజేపీ నేత , మెదక్ ఎంపీ రఘునందన్ రావు అభ్యంతర కర వ్యాఖ్యలు చేశారని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 4న రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న జడ్జి..న్యాయవ్యవస్థ పట్ల ఎంపీ రఘునందన్ రావు అగౌరవంగా మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతుందని లేఖలో తెలిపారు.