
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట పేరెంట్స్ ఆందోళన
కోల్బెల్ట్, వెలుగు: సీబీఎస్ఈ సిలబస్ చెప్పకుండా అధిక ఫీజులు తీసుకుంటున్న గ్రీన్వుడ్స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పేరెంట్స్ ఆందోళనకు దిగారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వారికి రాజకీయ, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మందమర్రి మండలం గద్దెరాగడిలోని గ్రీన్వుడ్స్కూల్లో సీబీఎస్ఈ ఉందని చెబుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్కాకుండా ఎక్సీడ్ అనే ప్రైవేట్ పబ్లికేషన్ ముద్రించిన లెసెన్స్చెబుతున్నారని మండిపడ్డారు. స్కూల్లో క్వాలిఫైడ్టీచర్లను నియమించకుండా స్టూడెంట్ల భవిష్యత్తో చెలగాటమాడుతున్నారని వాపోయారు.
అనంతరం అడిషనల్కలెక్టర్రాహుల్, డీసీపీ సుధీర్కేకన్రాంనాథ్ ను వేర్వేరుగా కలిసి వినతిపత్రం ఇచ్చారు. అంతకు ముందు స్కూల్ఎదుట ధర్నా చేశారు. కార్యక్రమంలో టీడీపీ లీడర్సంజయ్కుమార్, దళిత సంఘం లీడర్పలిగిరి కనకరాజు, తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, బీసీవీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సల్మాన్, ఎన్ఎస్ సీ జిల్లా అధ్యక్షుడు పురేళ్ల నితీశ్, టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేశ్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.