![Shankar: హమ్మయ్య బ్రతికించారు.. శంకర్ కొత్త సినిమా ఆగిపోయిందట!](https://static.v6velugu.com/uploads/2024/07/hindi-remake-of-director-shankars-aparichuthudu-has-been-shelved_RTPsLeuGor.jpg)
హమ్మయ్య బ్రతికించారు. ప్రస్తుతం శంకర్ అభిమానులు చాలా మంది అనుకుంటున్న మాట ఇదే. బయటికి చెప్పకపోయినా ఇండస్ట్రీలో చాలా మంది అందుకుంటున్న మాట కూడా ఇదే. ఇటీవల డైరెక్టర్ శంకర్ ఒక సినిమా గురించి మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పారు. దాంతో.. ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేంటి.. శంకర్ సినిమా ఆగిపోతే ఆయన అభిమానులు హ్యాపీ ఫీలవడం ఏంటి? ఫ్యాన్స్ అంతలా హ్యాపీ ఫీలవుతున్న ఆ ప్రాజెక్టు ఏంటి? అనుకుంటున్నారా!
అసలు విషయం ఏంటంటే.. కొంత కాలం క్రితం శంకర్ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ఓ సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అదే అపరిచితుడు హిందీ రీమేక్. ఈ విషయం తెలిసి ఆడియన్స్ షాకయ్యారు. అపరిచితుడు సినిమా అపరిచిత్ పేరుతో హిందీలో విడుదల కూడా అయ్యింది. అలాంటి సినిమాను ఇప్పుడు మళ్ళీ తీయడం ఏంటి? అది కూడా రణ్వీర్ తో. ఆ మ్యాజిక్ రిపీట్ అవడం కష్టం అని ఓపెన్ గానే కామెంట్స్ చేశారు.
ఇక మరికొందరేమో.. ఇండియన్ ఆడియన్స్ కి అపరిచితుడు అంటే చియాన్ విక్రమ్ అని, ఆ పాత్రను అంత పర్ఫెక్ట్ చేయడం ఎవరివల్ల కాదని, ఒకేవేళ వేరే హీరోతో రీమేక్ చేయడం చేస్తే ఒరిజినల్ సినిమాకు ఉన్న గౌరవాన్ని తగ్గించడం అవుతుందని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. అయినా కూడా మేకర్స్ అవన్నీ పట్టించుకోకుండా సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ, తరువాత ఎం జరిగిందో తెలియదు కానీ, ఆ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ ప్రకటించాడు శంకర్.
Also Read:వేట మొదలుపెట్టిన రాజమౌళి.. మహేష్కి విలన్గా స్టార్ హీరో
ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న శంకర్ ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. రణ్వీర్తో అన్నియన్ రీమేక్ చేయాలని ప్లే చేశాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలు మారాయి. భారీ బడ్జెట్తో మరో సినిమా చేద్దాం అని, అది అన్నియన్ కంటే భారీగా ఉండాలని నిర్మాతలు చెప్పారు. అలా సినిమా ఆగిపోయింది. కానీ, రణ్వీర్తో అన్నియన్ ను మించిన కథతో సినిమా తీస్తా’.. అని చెప్పుకొచ్చాడు శంకర్. దాంతో.. రీజన్ ఏదైతేనే.. అమరిచితుడు రీమేక్ ఆగింది అది చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.