
న్యూ ఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. కాలిఫోర్నియాలోని చినో హిల్స్ బాప్స్ స్వామి నారాయణ్ మందిర్గోడలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెయింట్తో విద్వేషపూరిత రాతలు రాశారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇక్కడ హిందూ సమాజంపై ద్వేషానికి వ్యతిరేకంగా దృఢంగా నిలుస్తామని తెలిపారు. చినోహిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందూ సమాజంతో కలిసి దీనిపై పోరాడుతామని చెప్పారు. మన మానవత్వం, విశ్వాసం కలిసి శాంతి, కరుణ ప్రబలంగా ఉండేలా చూస్తాయని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఘటనపై భారత్స్పందించింది. హిందూ ఆలయంపై దాడిని ఖండించింది. హిందూ ఆలయంపై దాడి హేయమైన చర్య అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్జైస్వాల్పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కాలిఫోర్నియా చినో హిల్స్లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడి వార్తలను చూశాం. ఇలాంటి చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అలాగే, ప్రార్థనా స్థలాలకు తగిన భద్రతను కల్పించాలని కోరుతున్నాం’’ అని అన్నారు.