పోటీ పరీక్షలు.. కుతుబ్​​షాహీలు బిట్​ బ్యాంక్​

పోటీ పరీక్షలు.. కుతుబ్​​షాహీలు బిట్​ బ్యాంక్​
  • కుతుబ్​షాహీల కాలంలో రాజ్యాదరణ పొందిన భాషలు పర్షియన్​, అరబిక్​, ఉర్దూ. 
  • మల్కిభరామునిగా కొనియాడబడిన గోల్కొండ సుల్తాన్​ ఇబ్రహీం కులీకుతుబ్​ షా.
  • ఇబ్రహీం కులీ కుతుబ్​షా ఆదరణ పొందిన తెలుగు కవి అద్దంకి గంగాధర కవి. 
  • అద్దంకి గంగాధర కవి తన తపతీ సంవరణోపాఖ్యానం గ్రంథాన్ని ఇబ్రహీం కులీకుతుబ్​ షాకు అంకితమిచ్చారు. 
  • ఇబ్రహీం కులీకుతుబ్​షా చింతలపాలెం గ్రామాన్ని రుద్రకవికి దానంగా ఇచ్చారు. 
  • పొన్నగంటి తెలగనార్యుడిని ఆదరించిన పఠాన్​చెరువు ప్రాంత అధికారి అమీన్​ ఖాన్​.
  • పొన్నగంటి తెలగనార్యుడు అమీన్​ ఖాన్​కు అంకితం ఇచ్చిన గ్రంథం యయాతి చరిత్ర.
  • అచ్చ తెలుగులో రాసిన మొదటి తెలుగు గ్రంథం యయాతి చరిత్ర.
  • మహమ్మద్​ కులీ కుతుబ్​ షా ఆస్థాన కవి గణేశ పండితుడు. 
  • గోల్కొండ కరణంగా పనిచేసిన మహ్మద్​ కులీ కుతుబ్​ షా కాలం నాటి తెలుగు కవి సారంగతమ్మయ్య. 
  • సారంగతమ్మయ్య రచన వైజయంతీ విలాసం.
  • అబ్దుల్లా కుతుబ్​షా సమకాలీనుడు, ఆయన ఆస్థానాన్ని సందర్శించి, ఆయనపై 1000కి పైగా పదకీర్తనలు పాడిన తెలుగు పద కవితా పితామహుడు క్షేత్రయ్య.
  • భక్తరామదాసుగా కీర్తించబడిన కంచర్ల గోపన్న, అబుల్​ హసన్​ తానీషా కాలంలో ఖమ్మం ప్రాంతానికి తహసీల్దార్ గా పనిచేశాడు. 
  • దాశరథీ శతకాన్ని రచించింది భక్తరామదాసు.
  • మధ్యయుగ వాస్తు శిల్పకారుల పనితనానికి మచ్చు తునక అయిన చార్మినార్​ను మహమ్మద్​ కులీకుతుబ్​షా క్రీ.శ.1590–91లో నిర్మించాడు. 
  • గోల్కొండ సుల్తానుల్లో గొప్ప వాస్తు కళాభిమాని మహమ్మద్​ కులీకుతుబ్​ షా.
  • మహమ్మద్​ కులీ కుతుబ్​షా హైదరాబాద్​ నగర నిర్మాణాన్ని క్రీ.శ.1590–91లో ప్రారంభించారు. 
  • హైదరాబాద్​ నగర నిర్మాణంలో మహమ్మద్​ కులీ కుతుబ్​షాకు అన్ని విధాల సహకరించిన వ్యక్తి మీర్​ మొమీన్​ మహమ్మద్​ అస్ట్రాబాదీ.
  • మీర్​ మోమీన్​ హైదరాబాద్​ నగర నిర్మాణాన్ని ఇరాన్​లోని ఇస్పాన్​ ఇ నౌ పట్టణం నమూనాలో నిర్మించాలని ప్రణాళిక రచించాడు. 
  • ఇరాన్​లోని సఫాయిద్​ నగరంలోని మైదాన ఇ నక్షజహాన్​ కూడలిగా చార్​మినార్​ను రూపొందించారు.
  • చార్​మినార్​కు ఉత్తర దిశన 80 గజాల దూరంలో కట్టించిన అద్భుత నిర్మాణం చార్​కమాన్​ లేదా జూలూఖానా.
  • సుల్తాన్​ మహమ్మద్​ కులీ కుతుబ్​ షా కాలంలో క్రీ.శ. 1595లో దారుషిఫా వద్ద యునాని హాస్పిటల్​ను నిర్మించాడు.
  • గోల్కొండ కోటను పాత మట్టికోట స్థానంలో రాతి కోటను సుల్తాన్​ కులీ కుతుబ్​షా నిర్మించాడు.
  • గోల్కొండ కోటకు 87 బురుజులు, 8 దర్వాజాలు కట్టించింది ఇబ్రహీం కులీ కుతుబ్​ షా.
  • గోల్కొండ పాత కోట చుట్టూ 7 కిలోమీటర్ల రాతికోటను ఇబ్రహీం కులీ కుతుబ్​షా నిర్మించాడు.
  • గోల్కొండ కోట దర్వాజాల్లో ఫతే దర్వాజ ముఖ్యమైంది.
  • గోల్కొండ కోట ఔరంగజేబు వశమైన తేదీ 1687, సెప్టెంబర్​ 21.
  • మూసీనదిపై పురానాపూల్​ వంతెనను క్రీ.శ.1578లో ఇబ్రహీం కులీ కుతుబ్​షా నిర్మించాడు.
  • పురాన్​పూల్ ను ప్రేమ వంతెన (బ్రిడ్జ్​ ఆఫ్​ లవ్​)గా క్రీ.శ.1676లో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్​ వర్ణించాడు.
  • పురానాపూల్​ను టావెర్నియర్​ పారిస్​లోని పాంట్​ నీఫ్​ అందంతో పోల్చాడు. 
  • హుస్సేన్​సాగర్​ను క్రీ.శ.1562లో ఇబ్రహీం కులీకుతుబ్​షా అల్లుడు హుస్సేన్​ షా వలీ నిర్మించాడు.
  • హుస్సేన్​సాగర్​కు బలక్​పూర్​ నది నుంచి నీరు వచ్చేది.
  • మక్కా మసీదు నిర్మాణం క్రీ.శ.1614లో మహమ్మద్​ కుతుబ్​ కాలంలో ప్రారంభమైంది. 
  • మక్కా మసీదు నిర్మాణం క్రీ.శ.1693లో పూర్తయింది.
  • దక్కన్​లో అతిపెద్ద మసీదు మక్కా మసీదు.
  • మక్కా మసీదు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిన వారు సుల్తాన్​ అధికారి మీర్​ఫజీ ఉల్లాబేగ్​, చౌదరి రాజయ్య.
  • మక్కా మసీదులోని ఏకశిలా నిర్మాణం మెహరబ్​.
  • కుతుబ్​ షాహీల సమాధులను గోల్కొండ కోటకు కిలోమీటరు దూరంలో బంజారా దర్వాజ వద్ద నిర్మించారు. 
  • కుతుబ్​ షాహీ రాజ కుటుంబ స్త్రీల్లో విశిష్ట స్థానం పొందినవారు మహమ్మద్​ కులీ కుతుబ్​షా ఏకైక కుమార్తె హయత్​ బక్ష్​ బేగం.