
తప్పుడు భూ రికార్డులు సృష్టించి.. ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన వారిపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నహెచ్ఎండీఏ చర్యలకు ఉపక్రమించింది.
మార్చి 28వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సహకారంతో ‘ఆపరేషన్ శంషాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు హెచ్ఎండీఏ ఎస్టేట్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.