
- ముస్లింల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నది కేసీఆరే
- మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో హోం మంత్రి మహమూద్ అలీ
హుస్నాబాద్, వెలుగు : ముస్లింలకు బీజేపీతో దోస్తీ కుదరదని, కాంగ్రెస్ను నమ్మితే మోసపోతారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర చేస్తున్న బీజేపీకి దూరంగా ఉండాలన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ను నమ్మవద్దన్నారు. ముస్లింల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నది కేసీఆరే అన్నారు. హుస్నాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ను గెలిపిస్తే కేసీఆర్ను గెలిపించినట్టేనన్నారు.
కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లింలు ఓటు బ్యాంకుగానే ఉన్నారని, వారి సంక్షేమాన్ని ఆ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ మైనార్టీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారన్నారు. గురుకుల పాఠశాలలు, విదేశాలకు వెళ్లాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ పథకాన్ని తీసుకొచ్చారన్నారు.
షాదీ ముబారక్ ద్వారా పేద ఆడపిల్లల తల్లిదండ్రుల బాధలు పోగొట్టారన్నారు. బీఆర్ఎస్ ముస్లింల ఇంటి పార్టీ అన్నారు. సతీశ్కుమార్ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఆయన ముస్లింల కోసం హుస్నాబాద్లో ఎన్నో పనులు చేశారన్నారు. కెప్టెన్ లక్ష్మీ కాంతారావు సైనికుడిగా, రాజకీయ నాయకుడిగా, మానవతావాదిగా ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు.