
వనపర్తి, వెలుగు: పోలింగ్ స్టేషన్లకు వెళ్లి ఓటు వేయలేని 85 ఏండ్లకు పైబడ్డ వయోవృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించగా, శుక్రవారం హోమ్ ఓటింగ్ ప్రారంభమైంది. వనపర్తి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన దివ్యాంగరాలు మాధవి, వల్లభ్నగర్లోని వయోవృద్ధురాలు బాలమ్మ (89) ఇండ్లకు వెళ్లిన సిబ్బంది వారిచే ఓటు వేయించారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 269 మంది హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ తెలిపారు. ఈ నెల 8 వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.