
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సీరియస్గా సాగుతోంది. 28 మంది అమాయక ప్రజలను ఊచకోత కోసిన నరహంతకుల కోసం భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ను అణువణువునా జల్లెడ పడుతున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 26) పుల్వామా జిల్లా త్రాల్లోని మోంఘమా ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని గుర్తించిన భద్రతా దళాలు.. ఐఈడీ బాంబులతో అతడి ఇంటిని నేలమట్టం చేశాయి. ఆదిల్ షేక్తో పాటు మరికొందరు లోకల్ టెర్రరిస్టుల స్థావరాలను కూడా జవాన్లు ధ్వంసం చేశారు. భారీ పేలుడుతో ఉగ్రవాది ఆదిల్ షేక్ ఇంటిని భారత దళాలు పేల్చివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అమాయక ప్రజల హత్యతో శోకసంద్రంలో మునిగిపోయిన దేశ ప్రజలు.. ఈ వీడియో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా రివేంజ్ టైమ్ స్టార్ట్ అయ్యిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మురంగా సెర్చ్ ఆపరేషన్ను కంటిన్యూ చేస్తున్నాయి. కొన్ని చోట్ల భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో ప్రకృతి అందాలకు నిలయమైన జమ్మూ కాశ్మీర్ తుపాకీ తూటాల చప్పుళ్లతో దద్దరిల్లితోంది.
కాగా, జమ్ముకాశ్మీర్లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే పహల్గాంకు కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. ముష్కరుల పాశవిక దాడిలో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు పర్యాటకులు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో దాయాది పాక్, భారత్ మధ్య వివాదం మొదలైంది.