
మహబూబ్నగర్ కలెక్టరేట్, వెలుగు : మహబూబ్నగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ ) సెంటర్లో హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో మేస్త్రీలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. చీఫ్ గెస్ట్గా హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ వైద్యం భాస్కర్ హాజరై మాట్లాడారు. రూ.5 లక్షల బడ్జెట్లో ఇంటి నిర్మాణం నాణ్యతగా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఎన్ఏఏసీ ఆఫీసర్లు ఇండ్ల నిర్మాణం కొత్త పద్ధతుల గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారని, శిక్షణ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని కోరారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎన్ఏఏసీ ఏడీ శివశంకర్, హౌసింగ్ డీఈ, ఏఈలు పాల్గొన్నారు.