
న్యూఢిల్లీ:అమెరికా టారిఫ్ వార్తో ఇండియాకు మేలు జరుగుతుందని, మన ఎగుమతులు పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం కెనడా, చైనా, మెక్సికోపై సుంకాలను పెంచింది. దీనివల్ల ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గుతాయి. ఫలితంగా మనదేశం అమెరికాకు మరిన్ని వస్తువులు అమ్ముకోవచ్చని మార్కెట్నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఇంజనీరింగ్, యంత్ర పరికరాలు, దుస్తులు, రసాయనాలు, లెదర్ఎగుమతులు పెరుగుతాయి. డోనాల్డ్ ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాక చైనాపై సుంకాలు పెంచడంతో ఇండియా లాభపడింది.
ట్రంప్ ప్రభుత్వం కెనడా, మెక్సికోపై విధించిన 25 శాతం సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. చైనీస్ ఎగుమతులపై సుంకాలను 20 శాతానికి పెంచారు. దీనివల్ల ఇండియాలోని ఎన్నో రంగాలకు ప్రయోజనం కలుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఈఓ)కు చెందిన ఎస్సీ రాల్హన్ అన్నారు. సుంకాలను పెంచడం వల్ల అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎగుమతులు తగ్గుతాయి. ఈ పరిస్థితి నుంచి భారత ఎగుమతిదారులు లాభపడవచ్చని రాల్హన్ చెప్పారు. థింక్ట్యాంక్ జీటీఆర్ఐ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని ప్రకటించింది.
అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు పెరుగుతాయని, అమెరికా నుంచి ఇండియాకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొంది. చైనాపై సుంకాలు పెంచడం వల్ల దిగుమతులు బలహీనపడుతాయని, ఇదే అదనుగా ఇండియా తన మాన్యుఫాక్చరింగ్సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించింది. అయితే గతంలో కుదుర్చుకున్న వ్యాపార ఒప్పందాలను ట్రంప్ గౌరవించలేదని, ఈసారి ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) కుదుర్చుకునేటప్పుడు ఇండియా జాగ్రత్తగా ఉండాలని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీనివాస్తవ అన్నారు.
టారిఫ్లు తగ్గించడంతోపాటు మరిన్ని సదుపాయాలు కల్పించాలని అమెరికా ఇండియాను అడగవచ్చని, వీటిలో గవర్నమెంట్ప్రొక్యూర్మెంట్ను ప్రారంభించడం, సాగు రాయితీలు తగ్గించడం, పేటెంట్కు ఉన్న రక్షణలను బలహీనపర్చడం వంటివి ఉండొచ్చని వివరించారు. ఎఫ్టీఏకు బదులు ఇండియా ‘జీరో ఫర్ జీరో’ టారిఫ్ విధానాన్ని ఎంచుకోవడం మేలని సూచించారు. అమెరికా నుంచి వచ్చే ఇండస్ట్రియల్ప్రొడక్టులపై సుంకాలను రద్దు చేస్తే, ఇండియా కూడా అలాగే చేయాలని అన్నారు.