అడవిలో ఆ రాత్రి ఏం జరిగింది?

అడవిలో ఆ రాత్రి ఏం జరిగింది?
  • మేడారం ఫారెస్ట్​లో  సెంట్రర్​టీమ్ విజిట్​ ​
  • ఫారెస్ట్ లో​  ప్రకృతి భీభత్సంతో విరిగిన చెట్లపై ఆరా..

ములుగు: మేడారం ఫారెస్ట్​లో చెట్లు ఎలా విరిగాయి..?  ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది.  ప్రకృతి బీభత్సం సృష్టించడానికి కారణాలు ఏంటీ..? ఇలా పలు సందేహ లపై సెంట్రల్​ టీమ్ ఆరా తీస్తుంది. 

ప్రకృతి బీభత్సంతో ఇటీవల మేడారం -తాడ్వాయి ఫారెస్ట్‌ ఏరియాలో భారీ వృక్షాలు నేలకూలాయి.  ఈ క్రమంలో వాతావరణ శాఖ, నేషనల్​రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీల ఆఫీసర్లు శుక్రవారం (సెప్టెంబర్5)  ఫారెస్ట్​ను విజిట్​ చేసింది.   మొత్తం పది టీమ్​లతో అటవీశాఖ విచారణ చేస్తుంది. ప్రకృతి బీభత్సానికి కారణాలను  ఆఫీసర్ల టీమ్​  క్షుణ్ణ్నంగా తెలుసుకుంటున్నారు.

మెట్రెలాజికల్, శాటిలైట్​ డేటా ఆధారంగా ఆ రోజు ఏం జరిగిందనే ఆధారాలను ఫారెస్ట్​టెక్నికల్​ టీమ్​ సేకరిస్తుంది.  మేడారం అడగుల్లో 204 హెక్టార్లలో 70 వేలకు పైగా భారీ వృక్షాలు నేలమట్టం అయిన్నట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. ఫారెస్ట్​లో పెద్ద ఎత్తున్న గాలి దుమారం, సుడి గాలుల బీభత్సంతో 50 నుంచి 60 మహావృక్షాలు వేర్లతో సహా కుప్పకూలాయని పేర్కొన్నారు. 

ALSO READ | ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ..అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

ఫారెస్ట్​ లో ఎక్కువగా టేకు, నల్లమద్ది, జిట్రేగి, బూరుగు, నల్లమద్ది, ఎర్రమద్ది, బొజ్జ, మారేడు, తెల్లమద్ది, నేరేడు లాంటి విలువైన వృక్షాలు నేలమట్టం అయిన్నట్లుగా ఆఫీసర్లు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలను ఇంకా పరిశోధనాత్మకంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.