ఉప్పల్లో కేజీ గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్ట్

ఉప్పల్లో కేజీ గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్: ఉప్పల్ లో భారీగా గంజాయి పట్టుబడింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ లో ఇద్దరు యువకులు గంజాయి విక్రయిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. వారి నుంచి 1100 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, బైక్, ఓసీబీ పేపర్స్ , ఐదె పెట్టెలు, సిగరెట్స్  స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయి స్తున్న సూరిశెట్టి మోహన్( 27), బాచుపల్లి దేవానంద్( 26) లను అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ సవరణ చట్టం 1985 కింద కేసు నమోదు చేశారు. మరో వ్యక్తి చిన్నారావు పరారీలో ఉన్నాడు. జ్యుడిషియల్ కస్టడీకోసం పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరు పర్చారు.