ములుగులో చికెన్, ఎగ్ మేళాకు భారీ స్పందన

ములుగులో చికెన్, ఎగ్ మేళాకు భారీ స్పందన

ములుగు, వెలుగు: తెలంగాణలో బర్డ్ ఫ్లూ  లేదని , ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు చికెన్ ని కోడిగుడ్లను వినియోగించవచ్చని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి  అన్నారు. గురువారం   ములుగులోని ఎండీ పౌల్ట్రీ ఆధ్వర్యంలో  చికెన్, ఎగ్​ మేళా నిర్వహించి ప్రజలకు  చికెన్ కూరా , ఉడికిన కోడిగుడ్లను  పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ....   70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడకడం వల్ల చికెన్ , గుడ్లు  తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

ప్రజలకు చౌకగా దొరికే  పోషక విలువలున్న మాంసాహారం చికెన్ మాత్రమే అన్నారు.  అపోహలు లేకుండా చికెన్ , కోడిగుడ్ల ను  వినియోగించాలని సూచించారు. ఏ టు జెడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జుబేర్ పాషా, మహదేవుని శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్, శ్రీను, నాగేష్, సులేమాన్, రవీందర్ గౌడ్, సలీం, ఖలీల్, జాంగిర్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 

దుబ్బాక, వెలుగు: వెన్​కాబ్​ ఆధ్వర్యంలో గురువారం దుబ్బాక పట్టణంలో నిర్వహించిన ఉచిత చికెన్​, ఎగ్​ మేళాకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. వండిన 240 కిలోల చికెన్, ఉడకబెట్టిన 2వేల కోడి గుడ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన వెంకటేశ్వర హెచరీస్​ కామారెడ్డి బ్రాంచ్​ మేనేజర్​ జయరాంరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆందోళన చెందకుండా నిర్భయంగా చికెన్​ను తినొచ్చని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం, కోడి గుడ్లను 70 సెంటి గ్రేడ్​లోఉడికించి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావన్నారు. వీటి వల్ల ప్రోటిన్​ లభిస్తోందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్ర్తీయంగా నిరూపిస్తున్నారని వెల్లడించారు. వెన్​కాబ్​ సంస్థ, చికెన్​ సెంటర్ల సహకారంతో దుబ్బాక పట్టణంలో నిర్వహించిన చికెన్​ మేళాకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. అపోహాలు లేకుండా ప్రజలు హాయిగా చికెన్​ తినొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్​ మేనేజర్​ స్వామి పాల్గొన్నారు.