నానమ్మని త్రిశూలంతో చంపి శివలింగానికి రక్తాభిషేకం : తర్వాత..?

నానమ్మని త్రిశూలంతో చంపి శివలింగానికి రక్తాభిషేకం : తర్వాత..?

సైన్స్, టెక్నాలజీ వల్ల ప్రపంచ ఇంతగా అభివృద్ధి జరిగినా.. మూడనమ్మకాలపై ప్రజల్లో విశ్వాసం మాత్రం పోవడం లేదు. సొంత నానమ్మనే నరబలి ఇచ్చాడు ఓ వ్యక్తి. నానమ్మని కిరాతంగా చంపి ఇంటికి దగ్గర్లో ఉన్న శివాలయంలోని శివలింగానికి ఆమె రక్తాన్ని ఆర్పించాడు. మూఢనమ్మకాలతోనే అతడు ఇలా చేశాడని ఊర్లో జనం చెప్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. 

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో నన్‌కట్టి గ్రామానికి చెందిన 30 ఏళ్ల గుల్షన్ గోస్వామి తన నానమ్మ రుక్మిణి గోస్వామి (70)తో కలిసి శివాలయానికి దగ్గరలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడు. అతను ప్రతిరోజూ శివాలయంలో పూజలు చేసేవాడు.  అక్టోబర్ 19న  (శనివారం) సాయంత్రం గుల్షన్ తన నానమ్మను త్రిశూలంతో పొడిచి చంపేశాడు. అనంతరం శివాలయానికి వెళ్లి ఆమె రక్తాన్ని శివలింగానికి అర్పించాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి అదే త్రిశూలంతో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

Also Read :- బిగ్ బాస్ షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలతో ఉన్న గుల్షన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి రాయపూర్ ఎయిమ్స్‌కు తరలించారు. వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూఢ నమ్మకాల వల్ల గుల్షన్ తన నానమ్మను నరబలి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.