
వైరల్ ఐ వర్క్ ఫర్ హ్యాపీనెస్
కొందరు సంపాదన కోసం జాబ్ చేస్తారు. మరికొందరు వ్యాపారం చేస్తారు. కానీ, చాలామంది వాళ్లు చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటారు. కొంతమందికి ఇతరుల గురించి కేర్ తీసుకోవడంలో సంతోషం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఆయన కూడా అంతే!ఆర్యాన్ష్. ఉదయ్పూర్లో ఒక ఉద్యోగి. ఆ రోజు వర్షం బాగా కురుస్తుండడంతో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన కారు పార్క్ చేశాడు. అక్కడ రోడ్ పక్కన సమోస, పోహా అమ్మే షాప్ కనిపించింది. ఆర్యాన్ష్ సమోస ఆర్డర్ చేశాడు. షాపులో ఉన్న పెద్ద మనిషిని చూసి, పాపం.. పెద్దాయన ఇంత వర్షంలో కష్టపడుతున్నాడు అని జాలిపడి ‘ఈ రోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా’ అన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన మాట విని ఆర్యాన్ష్కి ఆశ్చర్యం కలిగింది. పనిని ఎలా చూడాలో అర్థమైంది. ఇంతకీ ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే... ‘బాబూ.. ఈ వయసులో నేను కేవలం సంపాదించడానికి పని చేయడం లేదు. పని చేయడం వల్ల నా మనసుకు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం కన్నా ఇక్కడ షాపులో ఉండడం బెటర్. ప్రజలు ఇక్కడి ఫుడ్ తిని, టేస్ట్ ఎంజాయ్ చేయడం చూస్తుంటే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది’ అని. ఆయన మాటలు ఆర్యాన్ష్ మనసుని కదిలించాయట. దాంతో అక్కడ వాళ్లిద్దరి మధ్య జరిగిన ఆ ఇన్సిడెంట్ని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ‘ప్రపంచం అంతా పని గురించి మాట్లాడుతుంటే.. కొందరు తమ రిటైర్మెంట్ కథలు రాస్తున్నారు’ అని ముగించాడు ఆర్యాన్ష్. ఈ పోస్ట్కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే మిలియన్ వ్యూస్ దాటేసింది.
ఏఐతో బార్బీ మేకోవర్
క్రియేటివిటీకి కాదేదీ అనర్హం! ఇక్కడ చూస్తున్నారుగా.. పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న రాజకీయ నాయకులు. ఏంటి? వీళ్లంతా బార్బీ మూవీ సెలబ్రేషన్స్లో భాగంగా మేకోవర్ చేసుకున్నట్లు ఉంది కదూ. కానీ, ఇది నిజం కాదు. ఏఐ చేసిన మ్యాజిక్. మొన్నామధ్య ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ చెట్టాపట్టాలేసుకుని బీచ్లో తిరిగిన ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి గుర్తుందా? దానికి కారణం ఏఐ టెక్నాలజీ అని వార్తల్లో రాశారు. ఇప్పుడు ఈ పొలిటీషియన్లు బార్బీ మేకోవర్లో కనిపించడానికి కారణం కూడా అదే టెక్నాలజీ. మార్గట్ రోబీ, ర్యాన్ గాస్లింగ్ నటించిన ‘బార్బీ’ సినిమా జులై 21న విడుదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారులు, బ్రాండ్స్ ఇలా అందరూ బార్బీ ఫీవర్లో మునిగితేలుతున్నారు. పింక్ కలర్ కాస్ట్యూమ్స్, డెకరేషన్స్తో బార్బీ ప్రజెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక ఏఐ ఆర్టిస్ట్ తనదైన క్రియేటివిటీతో ఇంటర్నెట్ యూజర్స్ని అతనివైపు తిప్పుకున్నాడు. ప్రజలందరికీ బాగా తెలిసిన పది మంది ఇండియన్ పొలిటీషియన్స్ని బార్బీ మేకోవర్లో చూపించాడు. అందులో సోనియా గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అమిత్ షా వంటి నాయకులు ఉన్నారు. ఈ ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే తెగ ట్రెండ్ అయ్యాయి. ఆ ఫొటోల కింద ‘మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు?’ అని రాసి ఉంది. దానికి నెటిజన్లు రకరకాలుగా సమాధానం ఇస్తున్నారు.
హమ్మర్..ది జెయింట్
హమ్మర్ అనేది ఒక ఫోర్ వీలర్. చూడ్డానికి ఇది అన్ని హమ్మర్ వెహికల్స్లానే ఉంటుంది. కానీ, ఒక్క విషయంలో మాత్రం డిఫరెంట్. ఇది మామూలు హమ్మర్ వెహికల్స్ కంటే మూడు రెట్లు పెద్దది. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఈ బండి రోడ్ మీద పోలీసుల వెహికల్స్ పార్క్ చేసిన చోట ఆగింది. దాంతో ట్రాఫిక్ పోలీసులు సైరన్ మోగిస్తూ వెనక్కి వెళ్లమని సైగ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఇది షేక్ హమద్ బిన్ హమ్దన్ అల్ నహ్యాన్కి చెందింది. అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రాజకుటుంబ సభ్యుడు. బిలియనీర్ అయిన ఆయన వందల కొద్దీ అరుదైన కార్లు, ఆటోమోటివ్ క్రియేషన్స్ వంటివి సేకరించారు. అందులో కొన్ని వరల్డ్ రికార్డ్ సాధించినవి కూడా ఉన్నాయి. హమ్మర్ విషయానికి వస్తే ఇది14 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు, 5.8 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది నడపగలిగే వాహనమే. అయితే, ఈ వీడియో పోయినేడాది పోస్ట్ చేసింది. ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది రాసేటప్పటికే 21 మిలియన్ వ్యూస్తో దూసుకెళ్తోంది.