ఇల్లంద శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చోరీ

ఇల్లంద శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చోరీ

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని పగులగొట్టి నగదు అపహరించారు.  వరుస దొంగతనాలు జరుగుతున్నా.. పోలీసులు నిఘా పెంచడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఇక ఇలాంటి ఘటనలు  జరగకుండా గ్రామ పెద్దలు, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఊళ్లో ఉన్న మిగతా ఆలయాలపై కన్నేసి ఉంచాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే తమకు సమాచారం అందిచాలని పోలీసులు గ్రామస్థులకు తెలిపారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులకు గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.