
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి పట్టణంలో శనివారం నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త, ఆ తరువాత అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. టౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి ఆర్బీ నగర్లో మోసారపు నర్సింలు(50), మహేశ్వరి(45) దంపతులు నివాసం ఉంటున్నారు. మహేశ్వరి ఓ హోటల్లో కార్మికురాలిగా, నర్సింలు నిజాంసాగర్ చౌరస్తాలోని సులభ్కాంప్లెక్స్లో పని చేస్తున్నారు.
సులభ్కాంప్లెక్స్వద్దకు మహేశ్వరి రాగా, వీరి మధ్య గొడవ జరిగింది. కోపంతో నర్సింలు మహేశ్వరిపై గొంతు, కడుపులో కత్తితో పొడవటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తరువాత నర్సింలు కడుపులో పొడుచుకోవడంతో గాయాలయ్యాయి. కామారెడ్డి, ఆ తరువాత నిజామాబాద్గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.