అమ్మా.. గంగమ్మ తల్లి శాంతించు: హుస్సేన్​ సాగర్​ లో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ పూజలు

అమ్మా.. గంగమ్మ తల్లి శాంతించు: హుస్సేన్​ సాగర్​ లో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ పూజలు

తెలుగురాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని... గంగమ్మ తల్లిని శాంతింపజేసేందుకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ హుసైన్ సాగర్ లో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి , అల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సి , ఎస్టీ ఓబీసీ , మైనార్టీ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గంగమ్మకు పసుపు కుంకుమ , ముక్కు పుడకను సమర్పించి , హారతి ఇచ్చి శాంతించాలని వేడుకున్నారు. 

ఈ సందర్భంగా రాములు నాయక్ , కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ మాట్లాడుతూ... నిజాం హయాంలో కూడా ఇలా వర్షాలు పడినప్పుడు , గండిపేట్ చెరువులో గంగమ్మకు నిజాం నవాబ్ పూజలు చేసేవారని గుర్తు చేశారు. గంగా-జముని తహజీబ్ కు అది నిదర్శనం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచి , వరద బాధితులకు 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను ఈ భారీ వర్షాల నుండి కాపాడాలని గంగమ్మకు మొక్కుకున్నారు.