కుత్బుల్లాపూర్ : ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ట్విస్ట్

కుత్బుల్లాపూర్ : ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ట్విస్ట్

కుత్బుల్లాపూర్ సూరారంలో  దారుణంగా హత్యకు గురైన  ఏడేళ్ల చిన్నారి కేసులో  సంచలన విషయాలు బయటపెట్టారు  పోలీసులు.   చిన్నారిని అపహరించి, కత్తితో పొడిచి హత్య చేసి మేడ్చల్, బాసర గడి దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు నిందితుడు తిరుపతి .అయితే  చిన్నారి కుటుంబం మొత్తాన్ని హత్య చేసేందుకు  నిందితుడు  స్కెచ్ వేసినట్లు తెలిపారు  మేడ్చల్ ఎసిపి శ్రీనివాస్ రెడ్డి. 

చిన్నారి తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న నిందితుడు తిరుపతినే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని నిర్ధారించారు పోలీసులు.  కుటుంబంలో ముందుగా ఇద్దరు పిల్లలను, తర్వాత ఆమె సహచరుడిని  హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు తిరుపతి. హత్య చేసి ముళ్ళ పొదల్లో పారవేస్తే ఎవరూ గుర్తించలేరకున్నాడు నిందితుడు. నిందితుడు తిరుపతిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 


అక్టోబర్ 12న  కూతురు జ్యోష్న  కనిపించడం లేదని చిన్నారి తండ్రి ప్రభాకర్   మేడ్చల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.  అక్టోబర్ 15న  గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం కనిపించింది.   ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాలిక మృతదేహాన్ని ఆదిలాబాద్ జిల్లా చెందిన ప్రభాకర్ కూతురిదిగా గుర్తించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు  బాలికను  తిరుపతి హత్య చేసినట్లు గుర్తించారు.