
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారిలో చాలా మంది చిల్లర సమస్య ఎదుర్కొన్న వారే. చిల్లర తీసుకురాకుండా సతాయిస్తున్నారని కండక్టర్లు, డబ్బులు ఉన్నా ఇవ్వకుండా కండక్టర్లు పరేషాన్చేస్తున్నారని ప్యాసింజర్లు ఎప్పుడూ గొడవలు పడుతుండేవారు. కొన్నిసార్లు కొట్టుకుని పోలీస్స్టేషన్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలకు చెక్పెడుతూ ఆర్టీసీ అధికారులు సోమవారం నుంచి 25 డిపోల పరిధిలోని బస్సుల్లో డిజిటల్పేమెంట్స్కు అవకాశం కల్పించారు.
ప్రతి కండక్టర్కు టిమ్మెషీన్ ఇచ్చి యూపీఐ పేమెంట్ ఆప్షన్కు ఛాన్స్ఇవ్వడంతో దాదాపు 70 శాతం ప్యాసింజర్లు క్యూ ఆర్కోడ్స్కాన్చేసి టికెట్లు కొనుక్కున్నారు. దీంతో ఏండ్లుగా కొనసాగుతున్న చిల్లర సమస్యకు ముగింపు పలికినట్టయ్యింది. వాస్తవానికి, డిజిటల్పేమెంట్స్ను బండ్లగూడ, దిల్సుఖ్నగర్రూట్లలో కొంతకాలం కిందటే ప్రారంభించారు. దీనికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో సిటీలోని మిగతా ప్రాంతాల్లో సోమవారం నుంచి అమల్లోకి తెచ్చారు.
త్వరలో కార్డు స్వైపింగ్?
గ్రేటర్పరిధిలో 25 బస్ డిపోలకు 6వేల ఆటోమేటిక్ ఫెయిర్కలెక్టర్సిస్టమ్(టిమ్స్)ను పంపిణీ చేశామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. కండక్టర్లకు యూపీఐ విధానంలో టికెట్ఎలా ఇష్యూ చేయాలనేదానిపై ట్రైనింగ్ఇచ్చామని, త్వరలో కార్డు స్వైపింగ్విధానంలోనూ టికెట్ల జారీకి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
తిప్పలు తప్పినయ్
నేను బంజారాహిల్స్లో జాబ్చేస్తా...రోజూ మర్రిపల్లి నుంచి కోఠికి 201 ఎమ్బస్సులో వస్తా..ఇది బండ్లగూడ డిపో పరిధిలో ఉంటుంది..ఈ బస్సులో ఎప్పటినుంచో యూపీఐ పేమెంట్ఆప్షన్ఉండడంతో ఇబ్బందులు వచ్చేవి కావు. కానీ, కోఠి నుంచి 127కే లో బంజారాహిల్స్కు వచ్చే బస్సులో చిల్లర కోసం ఇబ్బంది పడేవాడిని.. ఇప్పుడు సిటీ అంతా డిజిటల్పేమెంట్ఆప్షన్తీసుకువచ్చారు...ఇక చిల్లర తిప్పలు తప్పినట్టే.
వెంకటేశ్, ప్రైవేట్ ఎంప్లాయ్
స్కానింగ్ లేదా అని అడిగెటోళ్లు
ఆర్టీసీ బస్సుల్లో ఈ చిల్లర సమస్య ఎప్పటినుంచో ఉంది. సిటీ బస్సుల్లో కూడా 500 ఇచ్చి చిల్లర అడిగేవాళ్లు ఉన్నరు. అలాంటి సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉండేవి. చాలామంది ఫోన్పే లేదా గూగుల్పే లేదా స్కానింగ్లేదా అని అడిగేవాళ్లు. దీన్ని గుర్తించిన మేనేజ్మెంట్టిమ్మెషీన్స్ఇవ్వడంతో చిల్లర కష్టాలు తీరినట్టయ్యింది.
సుధాకర్, కండక్టర్