
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్స్కూళ్లలో సీ గ్రేడ్విద్యార్థుల కు చెప్తున్న ఏఐ క్లాసులు రోజుకు 5 గంటలు ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్టీచర్లకు సూచించారు. సికింద్రాబాద్ లాలాపేట గవర్నమెంట్ స్కూల్ను సోమవారం ఆయన సందర్శించారు. ఎఫ్ఎల్ఎన్, ఏఐ, ఏఎక్స్ఎల్ ల్యాబ్ ను తనిఖీ చేశారు.
డీఈఓ ఆర్.రోహిణి, డిప్యూటీ డీఈఓ బాలు నాయక్, హెచ్ఎం రమణమ్మ పాల్గొన్నారు. మెహిదీపట్నం సఫ్దరియా బాలికల స్కూల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్లకు కండ్లద్దాలు అందించారు. కలెక్టర్తోపాటు డీఎం హెచ్ఓ డాక్టర్ వెంకటి పాల్గొన్నారు.