
- ప్రకటించిన గ్రీన్ప్యాక్
హైదరాబాద్, వెలుగు: గ్లాస్ ప్రొడక్టులను తయారు చేసే హైదరాబాద్ కంపెనీ ఏజీఐ గ్రీన్ప్యాక్ దాని ప్రస్తుత ఫర్నేస్లను ఆధునీకరించడానికి, ఉత్పత్తిని పెంచడానికి రూ.230 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. సంస్థ సీఈఓ రాజేశ్ఖోస్లా బుధవారం భువనగిరి ప్లాంటులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఏడాది తమకు రూ.2,421 రెవెన్యూ, రూ.600 కోట్ల ఎబిటా వచ్చాయని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు. ‘‘ గ్లోబల్ గ్లాస్ ప్యాకేజింగ్ మార్కెట్ ఈ ఏడాది 67.28 బిలియన్ల డాలర్ల నుంచి 2032 నాటికి 93.69 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుంది. మనదేశంలో రోజుకు 11 వేల టన్నుల గ్లాస్ప్యాకేజింగ్ ప్రొడక్టులు తయారవుతున్నాయి. డిమాండ్కూడా అంతే ఉంది. మాకు దేశవ్యాప్తంగా ఏడు ప్లాంట్లు ఉన్నాయి. భువనగిరి ప్లాంటు కెపాసిటీ రోజుకు 154 టన్నులు. మేం కొత్తగా యాంటీ డిప్రెషన్, యాంటీ బ్యాక్టీరియా బాటిల్స్కూడా తయారు చేస్తున్నాం. మా ప్రొడక్టులను చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం”అని ఆయన వివరించారు.