ట్రేడింగ్ ​పేరుతో 23 మందిని చీటింగ్​ సైబర్ ​క్రిమినల్​ అరెస్ట్

ట్రేడింగ్ ​పేరుతో 23 మందిని చీటింగ్​ సైబర్ ​క్రిమినల్​ అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రేడింగ్​ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్​ నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై దేశ వ్యాప్తంగా 23 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అంకిత్ అరోరా(38) ప్రైవేట్ ఉద్యోగి. ఈజీ మనీ కోసం గూగుల్​లో సర్చ్​చేస్తున్న టైంలో ఎక్కువ మంది ట్రేడింగ్​కు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుసుకున్నాడు. అలాంటి వారిని టార్గెట్​చేసి అక్రమ సంపాదనకు తెరలేపాడు. ట్రేడింగ్​టిప్స్​ఇస్తానని, చెప్పిన కంపెనీల స్టాక్స్​కొనాలని పలువురిని నమ్మిస్తున్నాడు. 

అలా సికింద్రాబాద్​కు చెందిన వ్యక్తిని Doll6726@navya  అనే టెలిగ్రామ్ ఐడీ ద్వారా సంప్రదించాడు. ట్రేడింగ్​గైడెన్స్​కు అధిక మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని నమ్మబలికి రూ.కోటి22లక్షల87వేల120 బదిలీ చేయించుకున్నాడు. తర్వాత ఫోన్లు, మెసేజ్​లు ఆగిపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్​క్రైమ్​పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అంకిత్​అరోరాను గుర్తించారు. ఇతనిపై దేశవ్యాప్తంగా 23 కేసులు ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ దార కవిత తెలిపారు. ప్రధాన నిందితుడు దీపక్ కుమార్ పరారీలో ఉన్నాడన్నారు.