దేవర హైప్ మాములుగా లేదుగా.. రక్తంతో అభిషేకం..

దేవర హైప్ మాములుగా లేదుగా.. రక్తంతో అభిషేకం..

సెప్టెంబర్ 27వ తారీఖున టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం తెలుగుతోపాటు, తమిళ్, కన్నడ, హిందీ తదితర భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలవుతోంది. దీంతో తారక్ అండ్ టీమ్ ముంబై, చెన్నై, కర్ణాటక అంటూ తిరుగుతూ ప్రమోషన్స్ లో బిజిబిజీగా గడుపుతున్నారు.

దీంతో అభిమానులు హంగామా షురూ చేశారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం కార్పొరేషన్ ఆఫిస్ ప్రక్కన 50 అడుగుల ఎన్టీఆర్ భారీ కటౌట్ నిర్మించారు. అంతటితో ఆగకుండా ఏకంగా రక్తంతో, పాలతో అభిషేకం చేశారు. ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా తెగ వైరల్ అవుతోంది. 

అయితే ఆ మధ్య గణేష్ విసర్జన్ సందర్భంగా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ముంబయిలోని దాదర్ చౌపటీ వద్ద సముద్రంలో హైలెట్ చేస్తూ దేవర చిత్ర కటౌట్‌ను ఉంచారు.

హైదరాబాద్‌లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 22వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, అనిరుధ్ రవిచందర్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం.