
- రెండు టూ వీలర్లు ధ్వంసం
- ప్రశ్నించిన బాధితులపై దౌర్జన్యం
- పోలీసులతోనూ వాగ్వాదం
- బ్రీత్ఎనలైజర్ పరీక్షలో ఓ యువతికి 212 రీడింగ్
కూకట్పల్లి, వెలుగు: పీకల దాకా మద్యం తాగి కారును ఓవర్స్పీడ్గా నడిపిన యువతులు.. ముందు వెళ్తున్న బైకులను ఢీకొట్టారు. బైకులు ధ్వంసం కాగా... ప్రశ్నించినందుకు బాధితులపైనే దౌర్జన్యం చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీసులతోనూ గొడవపడ్డారు. చివరికి వారికి బ్రీత్ఎనలైజర్తో టెస్టు చేయగా 212 బీఏసీ రికార్డయ్యింది. దీంతో డ్రంక్అండ్డ్రైవ్కేసు నమోదు చేశారు. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్పిల్లర్నంబర్ 740 వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
సాఫ్ట్వేర్ఇంజినీర్అయిన ఓ యువతి (28) మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కూకట్పల్లి నుంచి కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోంది. కేపీహెచ్బీ మెట్రోస్టేషన్వద్దకు రాగానే అదుపు తప్పి ముందు వెళ్తున్న రెండు బైక్లను ఢీకొట్టారు. వాహనదారులకు ఎలాంటి గాయాలు కాకపోయినా టూ వీలర్లు ధ్వంసమయ్యాయి. బాధితులు యువతులను ప్రశ్నించగా గొడవకు దిగారు. భారీగా ట్రాఫిక్జామ్అవుతుండడంతో ట్రాఫిక్పోలీసులు అక్కడికి వచ్చారు. కారులో చూడగా బీర్టిన్స్కనిపించాయి.
అప్పటికే మత్తులో ఉన్న వీరు కారులో కూడా డ్రింక్చేస్తూ వచ్చారని పోలీసులు గుర్తించారు. బ్రీత్ఎనలైజర్టెస్ట్ చేయగా పాజిటివ్వచ్చింది. కేసు నమోదు చేశారు. కారు నాగవెంకట హైందవి తొర్లికొండ పేరుతో రిజిస్టర్అయి ఉంది.