పీకల దాకా తాగి.. కారుతో బైకును గుద్ది.. కేపీహెచ్​బీలో అమ్మాయిల బీభత్సం

పీకల దాకా తాగి.. కారుతో బైకును గుద్ది.. కేపీహెచ్​బీలో అమ్మాయిల బీభత్సం
  • రెండు టూ వీలర్లు ధ్వంసం
  •  ప్రశ్నించిన బాధితులపై దౌర్జన్యం
  • పోలీసులతోనూ వాగ్వాదం 
  • బ్రీత్​ఎనలైజర్​ పరీక్షలో ఓ యువతికి 212 రీడింగ్​

కూకట్​పల్లి, వెలుగు: పీకల దాకా మద్యం తాగి కారును ఓవర్​స్పీడ్​గా నడిపిన యువతులు.. ముందు వెళ్తున్న బైకులను ఢీకొట్టారు. బైకులు ధ్వంసం కాగా... ప్రశ్నించినందుకు బాధితులపైనే దౌర్జన్యం చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన ట్రాఫిక్​ పోలీసులతోనూ గొడవపడ్డారు. చివరికి వారికి బ్రీత్​ఎనలైజర్​తో టెస్టు చేయగా 212 బీఏసీ రికార్డయ్యింది. దీంతో డ్రంక్​అండ్​డ్రైవ్​కేసు నమోదు చేశారు. కేపీహెచ్​బీ మెట్రో స్టేషన్​పిల్లర్​నంబర్ 740 వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 

సాఫ్ట్​వేర్​ఇంజినీర్​అయిన ఓ యువతి (28) మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కూకట్​పల్లి నుంచి కారుని డ్రైవ్​ చేసుకుంటూ వెళ్తోంది. కేపీహెచ్​బీ మెట్రోస్టేషన్​వద్దకు రాగానే అదుపు తప్పి ముందు వెళ్తున్న రెండు బైక్​లను ఢీకొట్టారు. వాహనదారులకు ఎలాంటి గాయాలు కాకపోయినా టూ వీలర్లు ధ్వంసమయ్యాయి. బాధితులు యువతులను ప్రశ్నించగా గొడవకు దిగారు. భారీగా ట్రాఫిక్​జామ్​అవుతుండడంతో ట్రాఫిక్​పోలీసులు అక్కడికి వచ్చారు. కారులో చూడగా బీర్​టిన్స్​కనిపించాయి. 

అప్పటికే మత్తులో ఉన్న వీరు కారులో కూడా డ్రింక్​చేస్తూ వచ్చారని పోలీసులు గుర్తించారు. బ్రీత్​ఎనలైజర్​టెస్ట్ చేయగా పాజిటివ్​వచ్చింది. కేసు నమోదు చేశారు. కారు నాగవెంకట హైందవి తొర్లికొండ పేరుతో రిజిస్టర్​అయి ఉంది.