
- నలుగురు అరెస్ట్, పరారీలో ఇద్దరు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నాంపల్లి, మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో రూ.1.70 లక్షల విలువైన 27.51 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. రంజాన్ షేక్ ముంబయిలోని అంధేరి నుంచి ఎండీఎంఏ డ్రగ్తీసుకువచ్చాడు. శుక్రవారం నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఇర్ఫాన్, అన్వర్లకు విక్రయిస్తుండగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్ మెంట్టీం, సీఐ చంద్రశేఖర్ గౌడ్ టీం పట్టుకున్నాయి. 24.10 గ్రాముల డ్రగ్ను స్వాధీనం చేసుకొని, ముగ్గురినీ అరెస్ట్చేశారు.
మల్కాజిగిరి ఆర్కే నగర్ లో డ్రగ్విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారంతో ఎస్ టీఎఫ్ బీ టీం సీఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు టీం అక్కడికి వెళ్లారు. డ్రగ్అమ్ముతున్న స్వాదీప్ ను పట్టుకొని, 3.41 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, స్కూటీ, ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. లిఖిత్, హరికృష్ణ బెంగళూరు నుంచి డ్రగ్తీసుకువచ్చి, స్వాదీప్ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. అతన్ని అరెస్ట్చేశామని, లిఖిత్, హరికృష్ణ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.