
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి 5 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్ చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1 ప్లాట్ నంబర్ 27 లోని 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ 2021 నవంబర్ 26న అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
నిర్వహణ ఖర్చుల కింద అదనంగా రూ.3 కోట్లను మంజూరు చేస్తూ ఇంకో జీవో ఇచ్చింది. ఆ జీవోలను కొట్టివేయాలంటూ న్యాయవాది కె.రఘునాథ్ రావు వేసిన పిల్ను జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి ఐఏఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్రెడ్డి వాదించారు. అనంతరం పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపించారు. అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.