
ఎల్బీనగర్, వెలుగు: ఓ సబ్జెక్టులో ఫెయిల్అవడంతో మనస్తాపానికి గురైన ఇంటర్స్టూడెంట్ సూసైడ్చేసుకుంది. నాగోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీలో ఉండే సుక్క రవికుమార్ కూతురు అరుంధతి(17) కొత్తపేటలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ఇయర్(బైపీసీ)చదువుతోంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అరుంధతి బోటనీ సబ్జెక్టులో ఫెయిల్అయింది.
తన రిజల్ట్చూసుకున్నాక తీవ్ర మనస్తాపానికి గురైన అరుంధతి ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు నాగోలులోని సుప్రజా హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు గౌతమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేస్ఫైల్చేశారు.