
శంషాబాద్, వెలుగు: మామిడికాయల కోసం వెళ్లి కరెంట్షాక్తో వ్యక్తి మృతి చెందాడు. హైదారబాద్ మెహిదీపట్నంకు చెందిన చేతన్ రెడ్డికి ఆరు నెలల కిందట పెండ్లి అయింది. తన భార్యతో మొయినాబాద్ భాస్కర లా కాలేజీలో గురువారం పరీక్ష రాసి తిరుగు వెళ్తున్నారు. మార్గమధ్యలో పెద్ద షాపూర్ పరిధిలోని ఓ మామిడి తోటలో పండ్లు తెంపడానికి చేతన్ మామిడి చెట్టు ఎక్కాడు.
చెట్టుపై పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ వైర్లు గమనించకపోవడంతో.. కరెంట్షాక్ తగిలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న శంషాబాద్రూరల్ పోలీసులు చేతన్ డెడ్బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.