హైదరాబాద్ మాస్టర్​ ప్లాన్ 2030 వచ్చేస్తుంది.. కలవనున్న నాలుగు జిల్లాలు

హైదరాబాద్ మాస్టర్​ ప్లాన్ 2030 వచ్చేస్తుంది.. కలవనున్న నాలుగు జిల్లాలు
  • మరో రెండు, మూడు నెలల్లో డ్రాఫ్ట్​
  • ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది ప్లాన్​ 
  • 13వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించనున్న హెచ్ఎండీఏ

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్​ప్లాన్​‌‌–2030ని ఈ డిసెంబర్​నాటికి అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ప్రభుత్వం కొన్ని నెలల కింద బల్దియా పరిధిలోకి శివారులోని 51 గ్రామాలను కలిపి గెజిట్​నోటిఫికేషన్​రిలీజ్​చేయగా, దీనికి తగ్గట్టుగా..2030 నాటి అవసరాలకు అనుగుణంగా హెచ్ఎండీఏ కొత్త మాస్టర్​ ప్లాన్​కు రూపకల్పన చేస్తోంది. రెండు, మూడు నెలల్లో డ్రాఫ్ట్ మాస్టర్​ప్లాన్​రిలీజ్​చేయనున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలను తీసుకుని, డిసెంబర్​వరకు తుది మాస్టర్​ప్లాన్ ప్రకటించనున్నారు.

అన్ని మాస్టర్ ​ప్లాన్లు ఒకే ప్లాన్గా..
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఐదు మాస్టర్​ప్లాన్లు ఉన్నాయి. ఇందులో కోర్​సిటీ, బల్దియా, ఎయిర్​పోర్ట్​అథారిటీ, సైబరాబాద్​ డెవలప్​మెంట్​అథారిటీ, ఎక్స్​టెండెడ్​ ఏరియా డెవలప్​మెంట్​మాస్టర్​ప్లాన్​ ఉన్నాయి. ఇలా ఐదు వేర్వేరు ప్లాన్లు ఉండడం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాలు రెండు మాస్టర్​ప్లాన్లలో ఉండడం, నిర్మాణదారులు పర్మిషన్లు తీసుకునేప్పుడు కూడా వేర్వేరు మాస్టర్​ప్లాన్లకు అనుగుణంగా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎన్ఓసీలు, అడ్రస్​లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో ఐదు మాస్టర్​ప్లాన్లను కలిపి యూనిఫైడ్​మాస్టర్​ప్లాన్ గా రూపొందించాలనుకుంటున్నారు. 

లాభాలెన్నో..
ఐదు మాస్టర్​ప్లాన్లను ఒకే మాస్టర్​ప్లాన్​గా రూపొందించడం వల్ల ఒక నిర్మాణం కోసం లేక ఎన్ఓసీ కోసం వచ్చేవారికి ఒకే చోటు నుంచి అనుమతులు ఇవ్వవచ్చని అధికారులు చెప్తున్నారు. మోడ్రన్​టెక్నాలజీతో గూగుల్​మ్యాప్స్, లోకల్​ రెవెన్యూ మ్యాప్​లు, విలేజ్​మ్యాప్​లను నేషనల్​జియోగ్రాఫిక్​ రీసెర్చ్​ఇన్​స్టిట్యూట్, నేషనల్​రిమోట్ సెన్సింగ్​ఏజెన్సీ ద్వారా ఒక పద్ధతిలో రూపొందించవచ్చంటున్నారు. దీని వల్ల ప్రస్తుత తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఉంటుందంటున్నారు. మాస్టర్​ప్లాన్​–2050 వరకూ నగరం మరింతగా విస్తరించే అవకాశం ఉన్న దృష్ట్యా అప్పటి అవసరాలకు అనుగుణంగా రోడ్ కనెక్టివిటీ, రెసిడెన్షియల్​జోన్స్, ఇండస్ట్రియల్​జోన్స్, అర్బన్​నోడ్స్​, గ్రీన్​జోన్స్​, గ్రిడ్ ​రోడ్లను పక్కాగా ప్లాన్​లో పొందుపరుస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

కలవనున్న నాలుగు జిల్లాలు
ప్రస్తుతం హెచ్ఎండీఏ 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. కొత్తగా చేరే ప్రాంతాలతో కలిపి 13,000 చదరపు కిలోమీటర్లు  విస్తరించనుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హెచ్ఎండీఏలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, సంగారెడ్డి ఉండగా.. త్వరలో మరో నాలుగు జిల్లాలు నల్గొండ, నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, వికారాబాద్​విలీనం చేయనున్నారు. ప్రస్తుతం 32 మండలాలు ఉండగా, మరో 73 మండలాలను కూడా విలీనం చేసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 10 జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని 3,600 చెరువులను రక్షించడానికి బ్లూ అండ్​గ్రీన్​పేరిటి స్పెషల్​ ప్లాన్​ను కూడా రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు.