గోదావరి ఫేజ్ 2, 3కు టెండర్ల ఆహ్వానం

గోదావరి ఫేజ్ 2, 3కు టెండర్ల ఆహ్వానం
  • రూ.5,383 కోట్లతో రెండు ప్యాకేజీలుగా పనులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు  చేపట్టనున్న గోదావరి రెండు, మూడో దశ పనులకు మెట్రో వాటర్ బోర్డు టెండర్లు పిలిచింది. ఆసక్తి గల కాంట్రాక్టర్లు, సంస్థలు ఈ నెల 12 నుంచి టెండర్లు దాఖలు చేయవచ్చని నోటిఫికేషన్​లో పేర్కొంది. రూ.5,383 కోట్లతో రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్న ఈ పనుల ద్వారా 50 కి.మీ. దూరంలో ఉన్న మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలను సిటీకి తరలించనున్నారు. ఇందులో 15 టీఎంసీలను గ్రేటర్​ప్రజల తాగునీటి అవసరాలకు, మరో ఐదు టీఎంసీలను ఉస్మాన్​సాగర్​, హిమాయత్​ సాగర్​లో నిల్వచేసి మూసీ ప్రక్షాళనకు వినియోగించనున్నారు. 

ప్యాకేజీ–1లో మల్లన్న సాగర్​ నుంచి ఘన్​పూర్​కు రా వాటర్​ను తరలించనున్నారు. ప్యాకేజీ –2లో ఘన్​పూర్​నుంచి ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​కు నీటిని తరలిస్తారు.  వీటిని రెండేళ్లలో పూర్తిచేసి నగరానికి 300 ఎంజీడీల నీటిని తరలించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. రెండు ఫేజ్​లు పూర్తయితే ఓఆర్ఆర్​ పరిధిలోని ప్రాంతాలకు కూడా తాగునీటిని అందించడానికి అవకాశం ఉంటుంది.