
హైదరాబాద్: ఏప్రిల్ 12న (శనివారం) హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 11 నుంచి 8 రాత్రి 8 గంటల వరకూ అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ ‘రామ్ మందిర్’ నుంచి మొదలయ్యే హనుమాన్ శోభా యాత్ర తాడ్బండ్ హనుమాన్ మందిర్ దగ్గర ముగుస్తుంది.
హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ ‘రామ్ మందిర్’ నుంచి మొదలై.. పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్పేట రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్గోపాల్పేట రోడ్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరీయల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్బండ్లోని హనుమాన్ మందిర్కు చేరుకుంటుంది.
𝗧𝗿𝗮𝗳𝗳𝗶𝗰 𝗔𝗱𝘃𝗶𝘀𝗼𝗿𝘆 𝗳𝗼𝗿 “𝗦𝗿𝗶 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗻 𝗝𝗮𝘆𝗮𝗻𝘁𝗵𝗶 𝗩𝗶𝗷𝗮𝘆𝗮 𝗬𝗮𝘁𝗵𝗿𝗮”, 𝗣𝗿𝗼𝗰𝗲𝘀𝘀𝗶𝗼𝗻 𝗳𝗿𝗼𝗺 𝗚𝗼𝘄𝗹𝗶𝗴𝘂𝗱𝗮 𝗥𝗮𝗺 𝗠𝗮𝗻𝗱𝗶𝗿 𝘁𝗼 𝗧𝗮𝗱𝗯𝘂𝗻𝗱 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗻 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 𝗮𝗻𝗱 𝗳𝗿𝗼𝗺 𝗞𝗮𝗿𝗺𝗮𝗻𝗴𝗵𝗮𝘁 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗻… pic.twitter.com/XlWZTUa6Lw
— Hyderabad City Police (@hydcitypolice) April 11, 2025
దీంతో.. ఈ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యన ప్రయాణించే వాళ్లకు పోలీసులు ప్రత్యామ్నయ రూట్లను సూచించారు. లక్డీ కాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ఉప్పల్ వైపు ప్రయాణించే వాహనదారులు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, ప్యారడైజ్ ఫ్లై ఓవర్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మొత్తం 10 కిలోమీటర్ల మేర ‘హనుమాన్ శోభా యాత్ర’ సాగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో శనివారం ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగనుంది.