హైదరాబాద్ లో 41 కేజీల గంజాయి సీజ్.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ లో 41 కేజీల గంజాయి సీజ్.. ముగ్గురు అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: గంజాయి అమ్ముతున్న ముగ్గురిని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కోరాపుట్​కు చెందిన బల హంథల్ అడ్డదారిలో సిటీకి గంజాయిని తీసుకొచ్చి కూకట్ పల్లికి చెందిన బుర్రా శ్రీనివాసులు(24), గోనుగుంట అభిషేక్​(21) ద్వారా అమ్మకాలు చేస్తున్నాడు. 

బుధవారం వెంగళరావునగర్​లోని నలంద స్కూల్​వద్ద గ్రౌండ్​లో ఉన్న వీరిని మధురానగర్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 41 కేజీల గంజాయి, రూ.40 వేల నగదు, ప్యాకింగ్ మెటీరియర్, ఒక డ్యూక్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఇన్​స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.