
గచ్చిబౌలి, వెలుగు: డిజిటల్అరెస్ట్పేరుతో బెదిరించి సిటీకి చెందిన ఓ రిటైర్డ్ ఇంజనీర్ను సైబర్నేరగాళ్లు చీట్ చేశారు. అతని అకౌంట్స్ నుంచి రూ.1.38 కోట్లు కొట్టేశారు. సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. కొన్నాళ్ల కింద సిటీకి చెందిన రిటైర్డ్ఇంజనీర్(82)కు ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడు. ఎస్ బీఐ ప్రతినిధిని అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘మీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్జరిగింది. మీపై కేసు నమోదైంది’ అని భయపెట్టాడు. ముంబై సైబర్ క్రైమ్ ఆఫీసర్ మాట్లాడతాడంటూ మరో వ్యక్తితో మాట్లాడించాడు. మనీ లాండరింగ్ జరిగిందని, ఆధార్ వివరాలు ఇవ్వాలని, చెక్చేస్తామని నమ్మబలికాడు.
భయపడిపోయిన వృద్ధుడు ఆధార్ వివరాలు చెప్పాడు. తర్వాత వారు చెప్పిన వివిధ బ్యాంక్అకౌంట్లకు రూ.1.38 కోట్లు బదిలీ చేశాడు. తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బును సైబర్క్రిమినల్స్వేర్వేరు బ్యాంక్అకౌంట్లకు మళ్లించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.
రూ.9.60 లక్షలను తమిళనాడులోని నమక్కల్కు చెందిన గోకుల్మారుతాచలమూర్తి(24) ఫెడరల్ బ్యాంక్అకౌంట్కి బదిలీ కాగా, రాహుల్ అనే వ్యక్తి విత్డ్రా చేశాడని గుర్తించారు. గోకుల్ తన బ్యాంక్అకౌంట్లు, పాస్బుక్లు, చెక్బుక్లు, ఏటీఎం కార్డులను కమీషన్ పద్దతిలో జాఫర్షరీఫ్, షారుఖాన్అనే ఇద్దరికి ఇచ్చాడని తేల్చారు. వారిద్దరు రాహుల్తో కలిసి సైబర్నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గోకుల్, జాఫర్షరీఫ్(23), షారూఖాన్(30)ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాహుల్పరారీలో ఉన్నాడు.