రైల్వేస్టేషన్లోనే గర్భిణి ప్రసవం.. మానవత్వం చాటుకున్న రైల్వే పోలీసులు

రైల్వేస్టేషన్లోనే గర్భిణి ప్రసవం..  మానవత్వం చాటుకున్న రైల్వే పోలీసులు

సికింద్రాబాద్​: సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఓ నిండు గర్భిణి అయిన ప్రయాణికులరాలు సుఖ ప్రసవం అయ్యేలా సాయం చేశారు. ఒడిశాకు చెందిన మహోజీ అనే మహిళ తన భర్తతో కలిసి దుండిగల్​ లో ఉంటోంది. వైజాగ్​ వెళ్లేందుకు దంపతులిద్దరూ సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ కు వచ్చారు. 

గర్భిణీ అయిన మహోజీకి పురిటి నొప్పుడు ఎక్కువ కావడంతో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్​ పోలీసులు... ఎమర్జెన్సీ యూనిట్​ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఆమెకు అక్కడే ప్రసవం చేశారు. ఆర్పీఎఫ్​ మహిళా కానిస్టేబుళ్లు ఒక బెడ్​ షీట్​ తో గర్భిణీకి రక్షణగా నిలిచారు. మహోజీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.