
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 30న ఉదయం10 గంటలకు రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. ఉగాది వేడుకల నిర్వహణపై అధికారులతో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ చర్చించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన అనుమతి, నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్ శాంతికుమారి ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఉగాది 'పంచాంగ శ్రవణం' ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొనాలని ప్రజలకు శైలజ రామయ్యర్ విజ్ఞప్తి చేశారు.