
- 14 లక్షల కనెక్షన్లలో మీటర్లున్నవి 5 లక్షలే
- 550 ఎంజీడీలు సరఫరాకు వస్తున్న ఆదాయం 100 కోట్ల లోపే..
- అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం
- మీటర్ రీడర్లు గుర్తించాలని వాటర్బోర్డు ఎండీ ఆదేశాలు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలో దాదాపు14 లక్షల వాటర్కనెక్షన్లు ఉండగా, ఇందులో కేవలం ఐదు లక్షల కనెక్షన్లకే మీటర్లు ఉన్నట్టు తేలింది. వాటర్బోర్డు రోజూ సిటీకి 550 ఎంజీడీల నీరు సరఫరా చేస్తుండగా, ఇందుకు తగ్గట్టు రెవెన్యూ రావడం లేదు. 13.80 లక్షల నల్లా కనెక్షన్లలో 5.11లక్షల కనెక్షన్లకు మాత్రమే మీటర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
మొత్తం కనెక్షన్లలో 80 శాతం డొమెస్టిక్కనెక్షన్లు(1/2అంగుళాలు) కాగా, మిగిలిన వాటిలో 10 శాతం మల్టీస్టోరీడ్(1/3, 1 అంగుళం), మరో 10 శాతం బల్క్, ఇండస్ట్రియల్సప్లయ్కనెక్షన్లు ఉన్నాయి. మీటర్లు లేని కనెక్షన్లలో 60 శాతం డొమెస్టిక్కాగా, తర్వాత స్థానం మల్టీస్టోరీడ్కనెక్షన్లేనని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా మీటర్రీడింగ్తీసుకునే వ్యక్తులు మీటర్లేని కనెక్షన్లకు యావరేజ్బిల్లు వేస్తున్నారు. దీంతో 550 ఎంజీడీలకు నెలకు దాదాపు రూ.200 కోట్లు రావాల్సి ఉండగా, రూ.100 కోట్లకు మించడం లేదు.
అధికారుల ఉదాసీనత
కొందరు అధికారులు నీటి మీటర్ల ఏర్పాటుపై ఊదాసీనత ప్రదర్శిండమే వాటర్బోర్డుకు ప్రతి నెలా ఆదాయం తగ్గడానికి కారణంగా తెలుస్తున్నది. గతంలో బోర్డు రెవెన్యూ విభాగంలో పని చేసిన ఓ ఉన్నతాధికారి నిర్వాకం వల్లే బోర్డు పరిధిలో నల్లా కనెక్షన్ల వ్యవహారం అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా నల్లా కనెక్షన్తీసుకున్న వెంటనే వినియోగదారుడు తప్పనిసరిగా మీటర్ ఏర్పాటు చేసుకునేలా చూడాలి. కానీ, నల్లా కనెక్షన్ఇవ్వడానికి ఏర్పాటు చేసిన సింగిల్విండో సెల్.. కనెక్షన్లను ఇవ్వడం వరకే పరిమితమవుతోంది.
మీటర్ బిగించుకున్నారా? లేదా? అన్నది చూడడం లేదు. అంతే కాకుండా ఆయా సెక్షన్ల అధికారులు కూడా ప్రతి కనెక్షన్కు మీటర్ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో బోర్డు ఆదాయంపై ప్రభావం చూపిస్తోంది. ఇక నుంచి నల్లా బిల్లులు జారీ చేసే టైంలో మీటర్రీడర్లు ఉన్నదీ లేనిదీ గుర్తించాలని వాటర్బోర్డు ఎండీ అధికారులను ఆదేశించారు. లేకుంటే వెంటనే మీటర్ఫిక్స్చేసుకోవాలని ఇంటి యజమానులకు సూచించాలని తెలిపారు.