
రేడియో మిర్చి, మైండ్ స్పేస్ ఆర్ఈఐటీ ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్లో ‘ఎకో రన్’ పేరిట 5కె, 10కె రన్నిర్వహించారు. వందల మంది ఐటీ ఉద్యోగులు, యువతీ యువకులు, సీనియర్ సిటిజన్లు, రాజస్థాన్, పుదుచ్చేరి, మధురై సహా వివిధ ప్రాంతాల నుంచి అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ నుంచి రన్లు మొదలై.. తిరిగి అక్కడే ముగిశాయి.
ప్రారంభ కార్యక్రమంలో సినీ హీరోయిన్ చాందిని చౌదరి సందడి చేశారు. అలాగే మౌర్య ఫౌండేషన్, మైక్రో కేర్ఈఎన్టీ హాస్పిటల్ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్స్టేడియంలో ‘రన్ ఫర్ హియరింగ్– డెసిబెల్ డాష్–2025’ పేరిట 2కె, 5కె, 10కె రన్ నిర్వహించారు. శాట్స్చైర్మన్ శివసేనారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వినికిడి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రన్నిర్వహించారు. – ఫొటోగ్రాఫర్, వెలుగు