రన్నింగ్ ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం

రన్నింగ్ ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం

హైదరాబాద్ లో దారుణం జరిగింది.   ట్రావెల్ బస్సులో వివాహిత (28) పై అత్యాచారం జరిగింది.  సెప్టెంబర్ 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 
బాధితురాలు  ఓ  ట్రావెల్స్ బస్సులో  కూకట్ పల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 22న  చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు  కూకట్ పల్లికి బదిలీ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు జర్నీ చేసిన ట్రావెల్స్ బస్సు వివరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.