ఆన్​లైన్​ జాబ్ పేరిట రూ.3.56 లక్షల చీటింగ్

ఆన్​లైన్​ జాబ్ పేరిట రూ.3.56 లక్షల చీటింగ్

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్ జాబ్ పేరుతో ఓ యువతిని చీట్​చేసి, సైబర్ నేరగాళ్లు రూ.3.56 లక్షలు కొట్టేశారు. ఆన్​లైన్ జాబ్స్ ఫ్రమ్ ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్​లిమిటెడ్​పేరుతో ఇటీవల సిటీకి చెందిన యువతి(22)కి మెసేజ్ వచ్చింది. నిజమేనని నమ్మిన ఆమె లింక్​ఓపెన్​చేసి డీటెయిల్స్​ఇచ్చింది. తర్వాత రూ.200 చెల్లించింది. తర్వాత కమీషన్​అంటూ యువతి అకౌంట్​కు రూ.100 వచ్చింది. తర్వాత రూ.1000కు రూ.250 కమీషన్ వచ్చింది.

తర్వాత వీఐపీ గ్రూప్ లో చేరితే పెద్ద మొత్తంలో కమీషన్ వస్తుందని మెసేజ్​రావడంతో యువతి అందులో చేరింది. విడతల వారీగా రూ.3లక్షల56వేల680 ట్రాన్స్​ఫర్​చేసింది. తర్వాత ఎలాంటి కమీషన్​రాకపోగా, ఇంకా డబ్బు పంపించాలని వార్నింగ్​మెసేజ్​లు రావడం మొదలయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.