నెక్లెస్​రోడ్​లో 3 వేల మంది మహిళలతో శారీ రన్​

నెక్లెస్​రోడ్​లో  3 వేల మంది మహిళలతో శారీ రన్​

చీరకట్టులో మహిళలు చేసిన ‘మార్నింగ్ ​రన్’ ఆకట్టుకున్నది. టాటా బ్రాండ్ ​తనైరా, బెంగళూరుకు చెందిన ఫిట్​నెస్​ కంపెనీ జేజే యాక్టివ్ ​సంయుక్తంగా ఆదివారం ఉదయం నెక్లెస్​ రోడ్​లో శారీ రన్​ నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,120 మంది మహిళలు పాల్గొన్నారు. రంగు రంగుల చీరలు ధరించి యూనిటీ, స్పిరిట్​ చాటారు. పలువురు హైఎండ్ ​బైకులపై సందడి చేశారు.

తనైరా సీఈఓ అంబుజ్​ నారాయణ ​, జేజే యాక్టివ్ కోచ్ ​ప్రమోద్ ​మాట్లాడుతూ.. మహిళలు ఫిట్​నెస్​, స్వీయ వ్యక్తీకరణపై అవగాహన కలిగి ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో చీరకట్టు ప్రత్యేకమైన జీవన సరళి అని, దీనికి గుర్తింపు తీసుకురావడం కోసం చీరకట్టుతో రన్ ​నిర్వహించామని చెప్పారు. ఇప్పటికే బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో శారీ రన్ నిర్వహించామని చెప్పారు. కుటుంబాల కోసం శ్రమించే మహిళలు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించాలన్నదే రన్ ​ఉద్దేశమన్నారు.  – వెలుగు, హైదరాబాద్ ​సిటీ/ముషీరాబాద్